Skip to main content

నేటి మోటివేషన్... విద్యార్థి, సుఖార్థి కాకూడదు.




సుఖార్థీ చేత్త్యజేద్విద్యాం విద్యార్థీ చేత్త్యజేత్సుఖం 
సుఖార్థినః కుతో విద్యా? సుఖం విద్యార్థినః కుతః?

సుఖం కోరుకుంటే విద్యను వదలాలి. విద్యను కోరుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖాన్ని కాంక్షించేవారికి చదువెక్కడ? విద్యకావాలనుకొనే వారికి సుఖమెక్కడ? అని ఈ శ్లోకానికి భావిద్యార్థి, సుఖార్థి కాకూడదు.వం.

“శ్రమ ఏవ జయతే” అనే వాక్యం అన్ని రంగాలకూ అన్వయిస్తుంది. ఏ మాత్రమూ శ్రమలేకుండా ఫలాలను ఆశించటం క్షమార్హం కాని నేరం. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలను పొందలుగుతారు. పూర్వకాలంలో విద్యార్థులందరూ గురుకులవాస క్లిష్టంగా చదివేవారని అనేక గ్రంథాలద్వారా తెలుస్తుంది.

నిజానికి ఇప్పుడంత కష్టం అవసరం లేదు. ఆధునిక కాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆహ్వానించి, స్వీకరించి,తమవ్యాసంగాన్నిమరింత పటిష్టం చేసుకోవటం అవసరం. ఐతే మౌలికమైన శ్రమను మాత్రం అలక్ష్యం చేయకూడదు.

ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోగల చిన్న, పెద్ద యంత్రాలు వచ్చాయని సంతోషించాలో, కొందరు పిల్లలు “రెండు రెళ్ళు నాలుగు” అని చెప్పటానికి కూడా “ క్యాలిక్యులేటర్” ఉంటేనేగానీ చెప్పలేక పోతున్నందుకు, వారి ధారణ శక్తి తగ్గుతున్నందుకు ఆందోళనపడాలో తెలియని పరిస్థితులున్నాయి.

కొందరు శ్రమపడి చదవటానికి విముఖులై, పరీక్షల సమయంలో అనూహ్యంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలద్వారా పరీక్షాకేంద్రాలకు బయట ఉండేవారినుంచి సమాధానాలు పొందున్నారు.ఇలా అజ్ఞానం వికసించి, విజ్ఞానం వికటించటం సాంకేతికవిద్యా విజయం కానేరదు.

తల్లిదండ్రులు పిల్లలకు సౌకర్యాలు సమకూర్చటం అవసరమే. కానీ ఆ సౌకర్యాలు పిల్లలను సోమరులుగా, భవిష్యత్తులో ఏ చిన్న కష్టం, ఏ కొద్దిపాటి అసౌకర్యం ఎదురైనా తట్టుకోలేని వారినిగా తయారు చేయకూడదు. కష్టం అనుభవిస్తేనే సుఖం రాణిస్తుంది. కేవల సుఖలాలస జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. శ్రమసౌందర్య సాధితమైన విద్య – సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది.

చిరంజీవులు విద్యావంతులై, సంస్కారవంతులై అధికారులుగా, దేశాధి నేతలుగా ప్రజలకు సేవచేసి ధన్యులుకావాలంటే, ముందుగా - వారు కష్ట, సుఖాలపట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. వెలుగు లేనిచోట చీకటి ఉంటుంది.కష్టం తెలియనిచోట కఠిన స్వభావమే రాజ్యమేలుతుంది.

కష్టపడి చదవటమే సుఖాన్ని పొందటానికి యోగ్యత. “కష్టపడని వ్యక్తికి అన్నం తినే హక్కు ఉండదు” అన్నారు గాంధీజీ. అందువల్ల కష్టపడి చదువుకోవాలని, దాని వల్ల లభించే సుఖమే ఆదరణీయమని, కష్టపడకుండా విద్యను పొందాలనుకోవటం అవివేకమని గ్రహించాలి.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...