Skip to main content

నేటి మోటివేషన్... మనిషిని అభిమానించగలం గానీ ద్వేషించే హక్కు మనకు లేదు..



నిన్నటి వరకూ ఎంతో ఇష్టపడిన మనిషిపై చిన్నదో, చితకదో కారణంతో అయిష్టం ఏర్పడుతుంది. అలా అయిష్టం మనసులో చోటుచేసుకున్న క్షణం మొదలు.. ఆ వ్యక్తీ, ఆ వ్యక్తితో ముడిపడిన ప్రతీ ఆలోచనా, ఆ వ్యక్తి హావభావాలు మొదలుకుని అభిప్రాయాలూ, మాటలూ, ఛేష్టల వరకూ ప్రతీదీ అపసవ్యమైనవిగానే, వికారంగానే కన్పిస్తుంటాయి. అవే ఆలోచనలనూ, అదే మనిషి చిరునవ్వునూ ఇన్నాళ్లూ మనం ఆస్వాదించాం. "ఎంత కల్లాకపటం లేని మనిషి మనకు జీవితంలో ఆత్మీయంగా దొరికారో కదా" అని మురిసిపోయాం. పదిచోట్లా ఆ మనిషి గురించి గర్వంగా చెప్పుకున్నాం. మరి ఆ చిరునవ్వులో ఈ క్షణం కుటిలత్వం గోచరిస్తోందంటే అది మన దృష్టిదోషమా.. లేక రాత్రికి రాత్రి ఆ మనిషిలో వచ్చిన అనూహ్యపు మార్పా?
 
మనుషుల్ని మనం దగ్గరకు తీసుకునేతనంలోనే మనం పరిణతిని కలిగి ఉండడం లేదు. ఒక వ్యక్తిలోని ఏదో ఒక్క పార్శ్యాన్నే చూసి మనం మనుషుల్ని అభిమానిస్తున్నాం, చేరువ అవుతున్నాం. మనకు నచ్చిన ఆ ఒక్క కోణంతో సరిపెట్టుకోకుండా మరింతగా ఆ వ్యక్తికి మనం దగ్గర అయ్యే కొద్దీ ఆ వ్యక్తిని నఖశిఖపర్యంతం గమనిస్తూ మనకు ఇంతకాలం ఆ మనిషిలో తెలియని కోణాలనూ గ్రహిస్తూ వాటినీ జడ్జ్ చేస్తూ.. వీలైతే మనకు నచ్చినట్లు ఆ ఇతర కోణాలనూ మరల్చాలని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడే చిక్కు వచ్చిపడుతుంది.
 
ఒక మనిషిని అభిమానించడం, దగ్గరవడానికి ఎలాంటి హద్దులూ లేవు. కానీ ఒక మనిషిని సరిచెయ్యచూడడం ఎవరి తరమూ కాదు. ఆ మనిషి తనంతట తాను తన మనసులోకి పూర్తిగా మనల్ని ఆహ్వానించి మనం ఏది చెబితే దాన్ని వేదంగా పాటిస్తే తప్ప! ఇదే విషయాన్ని గతంలో "పర్సనల్ జోన్" గురించి రాస్తూ వివరించాను కూడా!
దురదృష్టవశాత్తు మనం ప్రేమించేదీ, స్నేహం చేసేదీ ఒకే ఒక్క నచ్చిన లక్షణం ఆధారంగా! జీవితాంతం ఎదుటి వ్యక్తిలోని ఆ ఒక్క నచ్చిన లక్షణంతో సరిపెట్టుకోగలిగితే సమస్యే లేదు. కానీ చిన్న సందు ఇస్తే ఆ మనిషిని ఆసాంతం ఆక్రమించి.. ఆ మనిషి నడవడికను సైతం మనమే నిర్దేశించాలనుకునే నైజం మనది. అందుకే బంధాల్లో మనస్థత్వాలు పొసగట్లేదు. ఆ పొసగకపోవడం అర్థమైన క్షణం మొదలు మనం ఇంతకాలం అభిమానించిన వారినే ద్వేషించడం మొదలుపెడుతున్నాం.
 
మనకో స్వంత ప్రపంచం ఉన్నట్లే, అలాగే మనలోనూ వందల పార్శ్యాలు ఉన్నట్లే ఎదుటి వారిలోనూ క్షణానుకూలంగా కోట్ల కొద్దీ పార్శ్యాలుంటాయనీ, వాటిపై మన నియంత్రణ ఏదీ సాగదని, అసలు మనం వాటిలోకి జోక్యం చేసుకోవడానికి తగమనీ అర్థం చేసుకుంటే బంధాలతో ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
ఈ రోజు న్యూస్ బాక్స్…అన్ని వార్తలు ఒకే చోట                                                                                            https://www.vsbnews.in/?p=27343 ఈ న్యూస్ బాక్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే... మనలో చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఉంటుంది, అందుకే మేము మీకోసం ఓకే లింక్ ద్వారా లోకల్, స్టేట్, నేషనల్, ఇన్టర్నేషనల్,బిజినెస్, క్రైం,హెల్త్... ఇలాంటి ఏన్నో రకరకాల వార్తలను కలిపి ఒకే వార్తగా మీకు అందించాలనేది మాలక్ష్యం...

నేటి మోటివేషన్... శ్రమయే మూలం.. శ్రమయే దైవం..!

సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనీ సులభంగా అయిపోవాలని ఆశించేవాడు, కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు.  ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు. "నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు పది అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి" అని చెప్పి వెళ్లిపోయాడు ఆ పండితుడు.  "బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో... ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే.. వృధా శ్రమ కదా..!" అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్లిపోయాడు. ప్రతి పనినీ రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు.  కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.  పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే, వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హ...