Skip to main content

విద్యార్థి, సుఖార్థి కాకూడదు.



సుఖార్థీ చేత్త్యజేద్విద్యాం విద్యార్థీ చేత్త్యజేత్సుఖం 
సుఖార్థినః కుతో విద్యా? సుఖం విద్యార్థినః కుతః?

సుఖం కోరుకుంటే విద్యను వదలాలి. విద్యను కోరుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖాన్ని కాంక్షించేవారికి చదువెక్కడ? విద్యకావాలనుకొనే వారికి సుఖమెక్కడ? అని ఈ శ్లోకానికి భావం.

“శ్రమ ఏవ జయతే” అనే వాక్యం అన్ని రంగాలకూ అన్వయిస్తుంది. ఏ మాత్రమూ శ్రమలేకుండా ఫలాలను ఆశించటం క్షమార్హం కాని నేరం. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలను పొందలుగుతారు. పూర్వకాలంలో విద్యార్థులందరూ గురుకులవాస క్లిష్టంగా చదివేవారని అనేక గ్రంథాలద్వారా తెలుస్తుంది.

నిజానికి ఇప్పుడంత కష్టం అవసరం లేదు. ఆధునిక కాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆహ్వానించి, స్వీకరించి,తమవ్యాసంగాన్నిమరింత పటిష్టం చేసుకోవటం అవసరం. ఐతే మౌలికమైన శ్రమను మాత్రం అలక్ష్యం చేయకూడదు.

ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోగల చిన్న, పెద్ద యంత్రాలు వచ్చాయని సంతోషించాలో, కొందరు పిల్లలు “రెండు రెళ్ళు నాలుగు” అని చెప్పటానికి కూడా “ క్యాలిక్యులేటర్” ఉంటేనేగానీ చెప్పలేక పోతున్నందుకు, వారి ధారణ శక్తి తగ్గుతున్నందుకు ఆందోళనపడాలో తెలియని పరిస్థితులున్నాయి.

కొందరు శ్రమపడి చదవటానికి విముఖులై, పరీక్షల సమయంలో అనూహ్యంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలద్వారా పరీక్షాకేంద్రాలకు బయట ఉండేవారినుంచి సమాధానాలు పొందున్నారు.ఇలా అజ్ఞానం వికసించి, విజ్ఞానం వికటించటం సాంకేతికవిద్యా విజయం కానేరదు.

తల్లిదండ్రులు పిల్లలకు సౌకర్యాలు సమకూర్చటం అవసరమే. కానీ ఆ సౌకర్యాలు పిల్లలను సోమరులుగా, భవిష్యత్తులో ఏ చిన్న కష్టం, ఏ కొద్దిపాటి అసౌకర్యం ఎదురైనా తట్టుకోలేని వారినిగా తయారు చేయకూడదు. కష్టం అనుభవిస్తేనే సుఖం రాణిస్తుంది. కేవల సుఖలాలస జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. శ్రమసౌందర్య సాధితమైన విద్య – సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది.

చిరంజీవులు విద్యావంతులై, సంస్కారవంతులై అధికారులుగా, దేశాధి నేతలుగా ప్రజలకు సేవచేసి ధన్యులుకావాలంటే, ముందుగా - వారు కష్ట, సుఖాలపట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. వెలుగు లేనిచోట చీకటి ఉంటుంది.కష్టం తెలియనిచోట కఠిన స్వభావమే రాజ్యమేలుతుంది.

కష్టపడి చదవటమే సుఖాన్ని పొందటానికి యోగ్యత. “కష్టపడని వ్యక్తికి అన్నం తినే హక్కు ఉండదు” అన్నారు గాంధీజీ. అందువల్ల కష్టపడి చదువుకోవాలని, దాని వల్ల లభించే సుఖమే ఆదరణీయమని, కష్టపడకుండా విద్యను పొందాలనుకోవటం అవివేకమని గ్రహించాలి.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...