Skip to main content

నేటి మోటివేషన్... నిజంగానే, 'గమనించటం ఎలాగో వీళ్ళనుండే నేర్చుకోవాలి!'



అనగనగా ఒక తండ్రి. ఆయనకు ముగ్గురు పిల్లలు. ముగ్గురూ చాలా తెలివైన వాళ్లు.

కొన్నాళ్లకు తండ్రి చనిపోయాడు. బ్రతుకు తెరువు వెతుక్కుంటూ బయలుదేరారు ముగ్గురూ.
దారిలో వాళ్లకు ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. 'నా గుర్రం తప్పిపోయింది. మీకేమయినా కనబడిందా?' అని ఆ పెద్ద మనిషి అడిగాడు.

'ఈ దారినే పోయింది' అన్నాడు మొదటి వాడు.

'దాని కుడి కన్ను గుడ్డిదా?!' అన్నాడు రెండోవాడు.

'దాని మీద ఒక పిల్లవాడు ఉన్నాడు కదా?!' అన్నాడు మూడవ వాడు. ఆ పెద్ద మనిషి ఎంతో సంతోషపడ్డాడు.

'అంతా సరిపోయింది- మీరు ఎక్కడ చూసారు దాన్ని?!' అని అడిగాడు.

'మేము దాన్ని చూడలేదు' అన్నారు అన్నదమ్ములు.

'అవునా?! మరి చూడకుండా ఇవన్నీ ఎలా చెప్పారు?!' అన్నాడు పెద్ద మనిషి , కొంచెం అనుమానంగా.


'మా తెలివి తేటలతో చెప్పాం' అన్నారు అన్నదమ్ములు.

'చూడకుండా తెలివితేటలతో ఇదంతా ఎలా చెప్పగలరు, ఎవరైనా? మీరే నా గుర్రాన్ని దొంగలించారు! పదండి, రాజు దగ్గరకు! అన్నాడు పెద్ద మనిషి.

అందరూ రాజు దగ్గరికి పోయారు.

'అసలు గుర్రాన్నే చూడకుండా దాని గురించి అన్ని వివరాలు ఎలా చెప్పారు? అని రాజు కూడా అడిగాడు.

'మా తెలివి తేటలను ఉపయోగించి చెప్పాం' అన్నారు వాళ్ళు.

'అదే అడుగుతున్నది. ఆ తెలివి తేటలకు ఏమిటి ఆధారం?' అడిగాడు రాజు.

'అడుగు జాడలను బట్టి గుర్రం ఆ దారినే పోయిందని చెప్పాను' అన్నాడు మొదటి వాడు.

'బాట వెంబడి పెరుగుతున్న గడ్డిపోచల్ని గమనించాను. బాటకు ఎడమ ప్రక్కన ఉండే గడ్డి పరకలు మేసి ఉన్నాయి, కుడి ప్రక్కవి మేయలేదు. అట్లా తెల్సింది- అది గుడ్డిదని. దాని కుడి కన్ను పనిచేయట్లేదు' అన్నాడు రెండోవాడు.

'మేం వచ్చే దారిలో ఒక మడుగు ఎదురైంది. ఆ మడుగు దగ్గర గుర్రం అడుగులు, పిల్లవాడి అడుగులు కనబడ్డాయి మాకు. వాళ్లు దాంట్లో నీళ్లు తాగినట్లున్నారు. దాన్ని బట్టి గుర్రం మీద పిల్లవాడు ఉన్నాడని తెలుసుకున్నాను' అన్నాడు మూడోవాడు. రాజుగారు వీళ్ల తెలివికి విస్తుపోయాడు. అయినా 'పరీక్షించాలి' అనుకున్నాడు. భటులకు ఏదో చెప్పాడు. వాళ్ళు ఒక పెట్టె మోసుకొని వచ్చారు. 'ఈ పెట్టెలో ఏముందో చెప్పండి. అప్పుడు గానీ మీ మాటలు నమ్మను' అన్నాడు రాజు.

'ఇందులో తేలికైన వస్తువులు ఉన్నాయి!' అన్నాడు మొదటివాడు.

'అవి గుండ్రని వస్తువులు!' అన్నాడు రెండోవాడు.

'అవి మామిడి కాయలు!' అన్నాడు మూడోవాడు.


"నిజమే ప్రభూ!‌ వీళ్ళు సరిగా కనుక్కున్నారు!" అన్నారు భటులు, పెట్టె మూత తెరిచి చూపిస్తూ.

'ఇదెట్లా చెప్పగలిగారు?' అడిగాడు రాజు, ఆసక్తిగా.

'ఇద్దరు భటులు ఆ పెట్టెను అలవోకగా తీసుకొచ్చారు. వాళ్ళు మోసే తీరును బట్టి అందులో తేలికైన వస్తువులు ఉన్నాయని తెలిసింది' అన్నాడు మొదటివాడు.

'పెట్టెలో వస్తువులు దొర్లిన శబ్దం వినబడింది. అవి దొర్లినప్పుడు పెట్టె వంకర తిరగటమూ, భటులు దాన్ని సవరించటమూ చూసాను. అట్లా అవి గుండ్రనివని చెప్పాను' అన్నాడు రెండోవాడు.

'భటులు పెట్టెను తూర్పు వాకిలి నుండి తెచ్చారు. భవంతికి అటువైపున మామిడి తోపు కనిపిస్తూనే ఉంది. అదీగాక ఈకాలంలో కాచేది మామిడి కాయలే కదా; దీన్ని బట్టి చెప్పాను అవి మామిడి కాయలని!' అన్నాడు మూడోవాడు.

'బలే గమనిస్తారు మీరు! లోకాన్ని చూడటం ఎలాగో మీనుండే నేర్చుకోవాలి' అని రాజు వాళ్లను మెచ్చుకున్నాడు. వాళ్ళకు లెక్కలేనన్ని కానుకలిచ్చి, తన కొలువులోనే సలహాదారులుగా ఉంచుకున్నాడు.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...