Skip to main content

నేటి మోటివేషన్... ఓయ్ యువతా ఇది నీకోసమే...



మానసిక ఒత్తిడి.
జీవితంలో మన సమస్యలనుపరిష్కరించుకోకపోతే,మనపై ఒత్తిడికలుగుతుంది.
జీవితంలో కష్టాలు,నష్టాలు వుంటాయి.సుఖాలు,సంతోషాలు వుంటాయి .దుఃఖాలు వుంటాయి.
జీవితంలో వీటినే లో ups and downs అంటారు.(ఆటూ,పోటూ) అంటారు. మనసు పై ఒత్తిడికలుగుతుంది. వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలితద్వారా మనసు పై ఒత్తిడికలుగుతుంది.
ఈ ఒత్తిడిని దూరంగా వుంచ వచ్చు.
1.కష్టాలనుండి బయట పడలేక,భయం,ఆందోళన ,ఒత్తిడికి గురై,ఆత్మహత్య చేసుకోవడం.హా!మనం సమాజంలో చూస్తున్నాం.చదువులో వెనుక పడుతుంటే,తండ్రి తిట్టాడని,ప్రేమించిన అమ్మాయి,తిరస్కరించిందని,మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్నారు.

2.జీవితంలో రాజీపడి,కష్టాలు,సమస్యలనే ఊబి నుండి బయట పడలేక,జీవచ్ఛవాలుగా బ్రతికేయడం.తద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు,అనవసరంగా పిల్లలను కొట్టడం,బంధువులు,స్నేహితులతో ఘర్షణలు పడటం,త్రాగుడు,జూదంకు బానిస అవడం చూస్తున్నాము.

3.కష్టాలను,సమస్యలను మనోధైర్యంతో ,ఎదుర్కొని,మరిన్ని మంచి పరిష్కార మార్గాలకోసం దీర్ఘంగా ఆలోచించడం,పరిస్థితులను బాగా అవగాహన చేసుకోవడం అవసరం.కృషి చేయడం.ఏకాగ్రతతో ,దుర్భర పరిస్థితులను అధిగమించడం.ప్రగతి శీలకమైన ఆలోచనా సరళితో ,సమయాన్ని సద్వినియోగం చేసుకుని,పోగొట్టుకున్న దాన్ని వెదకి స్వంతం చేసుకుని ,విజయం సాధించడం.మన్ననలను పొందడం ,తన ఔన్నత్యాన్ని సమాజం ముందువుంచి మెప్పుపొందడం.అవసరమైనంత రిస్క్,(సాహసం) చేసి కష్టాలనుండి బయటపడి తమ ఔన్నత్యాన్ని నిరూపించుకుని మెప్పుపొందడం.

అలాంటి ప్రముఖు వ్యక్తులలో అబ్దుల్ కలాం గారు ముఖ్యులు.వారు యువతకు ఆదర్శప్రాయులు.
కలాంగారికి మంచి ఆశయం(ambition) వుండేది.కనుక ఆయన విజ్ఞానం కోసం కృషి చేసి సఫలీకృతులయ్యారు.మిసైల్ మేన్ గా గుర్తింపు పొందారు.దేశ అంబుల పధిని బలపరిచి ,దేశభక్తిని చాటుకున్నారు.దేశ ప్రధమ పౌరునిగా ఎదిగారు.గౌరవించ బడ్డారు.దేశ విద్యార్ధులకు చాలా అంశాలపై  క్లారిటీ (స్పష్టత) నిచ్చారు.లక్ష్యాలను (targets) నిర్దేశించారు,లాజికల్ గా ఆలోచించడం నేర్పారు.దేశం మరువలేని సేవలు చేస్తూ ,విద్యార్ధుల మధ్యన ,వారికి స్పూర్తినిస్తూ స్వర్గస్థులైనారు.
ఆయనఆదర్శాలను స్పూర్తిగా ,యువత స్వీకరిస్తే ,విజయం సాధించడం జరుగుతుంది.యువతలో ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా వుంటూ,క్రమశిక్షణతో విజయపథం లో ముందుకు సాగుతారు.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...

నేటి మోటివేషన్... అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద...

సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధ...