Skip to main content

నేటి మోటివేషన్... మెదడుని ప్రశాంతంగా ఉంచడం


ఇంటర్నెట్, సోషల్ మీడియా కారణంగా చాలా మంది పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. రాత్రి చాలా సేపు దానితోనే గడుపుతూ ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయమే ఆలస్యంగా మేల్కొనడం, లేవగానే ఫోన్ పట్టుకుని కూర్చోవడం వంటివి సాధారణమైపోయాయి. దీని కారణంగా మన మెదడు మొద్దుబారిపోతోందని... ఆలోచనా శక్తి, ఏకాగ్రత తగ్గిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ పొద్దునే కొన్ని రకాల అలవాట్లను చేసుకుంటే... మెదడు చురుకుగా మారుతుందని వివరిస్తున్నారు.

రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్రలేవడం
ఎవరైనా సరే రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్ర లేవడం వల్ల మన శరీరంలోని జీవగడియారం (సర్కాడియం రిథమ్) సరిగా సెట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.

యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు, మెడిటేషన్ చేయండి
ఉదయమే కాసేపు యోగా లేదా కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో శరీరంలో ఒత్తిడి తగ్గి, అప్రమత్తత పెరుగుతుందని వివరిస్తున్నారు. దీనితో రోజంతా మెదడు, శరీరం చురుకుగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

మీ ఆలోచనలు, లక్ష్యాలను రాసుకోవడం...
రోజూ ఉదయం నిద్రలేచిన కొంతసేపటి తర్వాత ఆ రోజుకు సంబంధించి మీరు చేయాల్సిన పనులు, ఆలోచనలు, లక్ష్యాలను రాసిపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీలో ఒత్తిడిని తగ్గించి, సమస్యలను పరిష్కరించుకోగల శక్తిని పెంచుతుందని... కొత్త ఆలోచనలను కలిగిస్తుందని వివరిస్తున్నారు. ఉదయమే ఫ్రెష్ గా తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఏదైనా చదవడం... ప్రాక్టీస్ చేయడం...
ఉదయమే ఏదైనా చదవడం, నేర్చుకోవడం, పజిల్స్ సాల్వ్ చేయడం వంటివి మెదడు షార్ప్ అవడానికి తోడ్పడతాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మెదడులో కొత్త సమాచారం స్టోర్ అవడం, సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా ఉత్సాహంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

సరైన పోషకాహారం తీసుకోవడం...
ఉదయమే శరీరానికి, మెదడుకు తగిన శక్తిని అందించగల సరైన పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు తగిన మోతాదులో ఉండేలా చూసుకుంటే... రోజంతా ఉత్సాహంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఉదయమే కాసేపు ఎండలో గడపండి
రోజూ ఉదయమే కాసేపు ఎండలో గడిపితే.. శరీరంలో సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయపు ఎండలో యోగా, వ్యాయామం, ధ్యానం వంటి చేయవచ్చని... దీనివల్ల రెండు రకాలుగానూ లాభం ఉంటుందని వివరిస్తున్నారు.

పరగడుపునే కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగండి
రాత్రంతా చమట, శ్వాస ద్వారా నీరు వెళ్లిపోయి... ఉదయమే శరీరంలో కాస్త డీహైడ్రేషన్ పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఉదయమే కాలకృత్యాలు తీర్చుకున్నాక పరగడుపునే కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. దీనితో శరీరంలో విష పదార్థాలు, వ్యర్థాలు బయటికిపోయి శుభ్రం అవుతుందని.. మెదడుకు చురుకుదానాన్ని ఇస్తుందని చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.

వ్యాయామం తప్పనిసరిగా చేయండి
రోజూ ఉదయమే తప్పనిసరిగా కొంతసేపు వ్యాయామం చేయండి. వేగంగా నడవడం (బ్రిస్క్ వాక్), లేదా చిన్నపాటి వ్యాయామాలు చేసినా... శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగిన స్థాయిలో అందుతుంది. అంతేగాకుండా వ్యాయామం వల్ల శరీరంలో బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ విడుదల అవుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, నేర్చుకునే శక్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...

నేటి మోటివేషన్... అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద...

సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధ...