Skip to main content

నేటి మోటివేషన్... మీ చిన్నప్పుడు చదవకపోతే... ఇప్పుడైనా చదవండి...



ఒక రోజు ఒక అడవిలో వేటకు బయలుద్యారిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తోంది. ఆ ఆవుని చూడగానే పులికి నోరూరుంది. ఈ రోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించు కుంది. ఆ ఆవు పైబడ డానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది.

“ఆగండి పులిగారు, ఆగండి!” అని గట్టిగా కేక పెట్టింది.

పులి నిర్ఘాంత పోయింది. ఇంత వరకు ఏ జంతువూ పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయ పడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం, పులికి తెలుసు. కాని ఇలా ఆగమనడం? ఇది కొత్త విషయం.

సంగతేంటో తెలుసుకుందామని పులి ఆగింది.

“అడగ గానే ఆగినందుకు థాంక్స్, మీకు అడ్డు పడినందుకు క్షమించండి.” అంది ఆవు.

“విషయం ఏమిటో చెప్పు” అంది పులి.

“నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలు ఇచ్చి, ఈ అడవిలోకి వచ్చి, రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళి వెళ్లి దూడకు పాలిస్తాను. రోజు లాగానే ఈ రోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళి వస్తానని, పాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్లక పొతే నా దూడకు పాలుండవు. జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ వుంటుంది నా బిడ్డ. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్లి దూడకి పాలిచ్చి, జరిగిందంతా చెప్పి, మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను. ప్లీజ్ ఈ సహాయం చేయండి!” అని ఆవు అడిగ్గింది.

పులి నవ్వడం మొదలెట్టింది. “బాగానే చెప్పావు కథ. నా నుంచి తప్పించుకోవడానికే కదా?” అంది.

“లేదు, పొద్దున్నే వచ్చేస్తాను కదా, నన్నూ నమ్మండి” అంది ఆవు.

పులికి ఆవు మాట నమ్మాలో, నమ్మ కూడదో అర్ధం కాలేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితి కనిపించింది. కాని ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు? ఒక సారి పులిని తప్పించుకున్న వాళ్ళు మాళ్ళి ఆ పులి దేగ్గిరకి వెళతారా? అసలు సాధ్యమా?

యేది ఏమైనా ఆవు తెలివిని మెచ్చుకో వలసిందే. సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాము, ఆవుని వదిలేద్దాము అని నిశ్చయించుకుంది పులి. మళ్ళీ ఆవు తిరిగి రాదని తెలిసినా ఊరికే “సరే వెళ్ళు, రేపు పుద్దున్నే ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తాను” అని ఆవుతో అంది.

ఆవు మొహం మీద సంతోషం, ఆశ్చర్యం రెండు కనిపించాయి.

ఆవు, “నేను తప్పకుండా వస్తాను, నా మాట నమ్మండి” అని ఇంటికి బయలుద్యారింది.


ఇంట్లో దూడకి పాలు ఇచ్చి, జరిగింది చెప్పింది. అమ్మ లేకపోయినా పరవాలేదు, నీకు అందరు సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలి, అని దూడకి ధైర్యం చెప్పింది.

గ్రామంలోని తన బంధువులు, మిత్రులు అయిన ఇతర ఆవుల కి కూడా జరిగిన సంగతి చెప్పి, “నేను లేనప్పుడు నా దూడని కూడా మీ బిడ్డ లాగా చూసుకోండి,” అని కోరింది.

ఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవుని తిరిగి వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేసాయి. “పులినుంచి తప్పించుకుని మళ్ళి వేలతానంతావేంటి? అసలు ఇందులో అర్ధముందా?” అని చాలా నచ్చ చెప్పడానికి చూసాయి. కాని మన ఆవు, “లేదు, నేను మాట ఇచ్చాను, నా దూడకి పాలు ఇచ్చి, ఎవరికైన అప్ప చెప్పి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను” అని చెప్పింది.

పొద్దున్నే ఆవు దూడ విడిపోతూ బాగా ఎడిచాయి. మరొక సారి ఆలోచిన్దుకోమని బంధు మిత్రులు చెపుతున్నా తన మాట మీద నిలపదాలని ఆవు అడవిలోకి వెళ్ళింది. కాని మనసు మట్టుకు భారంగానే వుంది. బాగా భయ పడుతూ అడవి చేరుకుంది.

అడవిలో పులికి ఆవు వస్తుందని ఏ మాత్రం నమ్మకం లేదు! అయినా ఎందుకో ఒక ఉత్సుకత. ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి. అందుకని అనుకున్న సమయానికి మళ్ళి ఆ ఆవును కలుసుకున్న చోటికి వెళ్ళింది.

అక్కడ ఆవుని చూసి చాలా ఆశ్చర్య పోయింది. “నువ్వు నిజంగా వస్తావనుకో లేదు! నీ దూడకి చెప్పావా?” అని అడిగింది.

ఆవు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నా, ధైర్యంగా సమాధానము చెప్పింది, “మీరు చేసిన సహాయానికి చాలా థాంక్స్ అండి – నేను దూడకి పాలిచ్చి, జరిగినది చెప్పి, సెలవు తీసుకుని వచ్చాను.”

“మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకి పాలు ఏవరు పడతారు?” అని పులి అడిగింది.

“నా బంధు మిత్రులకు అప్ప చెప్పి వచ్చాను” అంది ఆవు.

“మరి వాళ్లకి ఏం చెప్పావు?” అంది పులి.

“నిజమే చెప్పాను,” అంది ఆవు.

“వాళ్ళు నిన్ను ఆపలేద? వెళ్ళద్దని అనలేదా?” అని ఆశ్చర్యంగా అడిగింది పులి.

‘అన్నారుకాని, నేను మీకు మాట ఇచ్చాను కదా. అందుకే అందరికి సద్ది చెప్పి వచ్చాను” అంది ఆవు.

పులికి ఆవు నిజాయితి చాలా నచ్చింది. “ఇంత వరకు నేను నీ లాంటి జంతువును ఎప్పుడు కలవ లేదు. నీ లాగా ఇలా మాట మీద నిలపడ డానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నీ లాంటి మంచి ఆవుని నేను తినలేను. నువ్వు నిర్భయంగా రోజు ఈ అడవిలోకి వచ్చి వెళ్ళచ్చు” అని చెప్పి, ఆవుని ఏమి చేయకుండా వెళ్ళిపోయింది.

ఆవుకి బాధ, ఏడుపు, మనసులోని భారం, అన్ని టప్పున తగ్గిపోయాయి. ఆ రోజు గడ్డి మేయకుండానే పరిగెత్తుకుంటూ మళ్ళి ఇంటికి వెళ్లి దూడని గట్టిగా వాటేసుకుంది.

మనం నిజం చెబుతూ, నిజాయితీగా వుంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదురుకో గలము.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...