Skip to main content

జీరో షాడో డే అంటే ఏమిటి... తరువాత ఎక్కడెక్కడ ఆవిషకృతం కానుంది...



🔊Zero Shadow Day: ఆ కాసేపు నీడ కనిపించలేదు.. హైదరాబాద్‌లో అరుదైన ఘట్టం ఆవిష్కృతం


🍥హైదరాబాద్‌: నగరంలో నీడ కనిపించని అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది. ‘జీరో షాడో డే’ సందర్భంగా హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ ప్లానిటోరియం వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు ఆసక్తిగా తిలకించారు.

🌀వైజ్ఞానిక ప్రపంచం జీరో షాడోగా పరిగణించే ఈ దృశ్యం.. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించడం వల్ల జరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా (90 డిగ్రీలు) ఏదైనా వస్తువును ఉంచితే దానిపై రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తెలిపారు.

💥ఈ విచిత్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందో తెలుసా?

✳️ఇలాంటి విచిత్రం ప్లస్‌ 23.5, మైనస్‌ 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, సరిగ్గా నడి నెత్తి మీదికి వచ్చినప్పుడు నీడ మాయం అవుతుంది! నిజానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలోనూ కాస్త ఉత్తరం వైపో, దక్షిణం వైపో వాలి ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరిగే మన భూమి అక్షం 23.5 డిగ్రీల వాలుతో ఉంటుంది. దీని మూలంగానే రుతువులు ఏర్పడుతుంటాయి. అయితే ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి సూర్యుడి వంపు అక్షాంశంతో సమానమవుతుంది. అప్పుడు సూర్యుడు సరిగ్గా నడి నెత్తి మీదికి వస్తాడు. దీంతో ఆయా వస్తువుల నీడ భూమి మీద పడదు. ఈ పరిస్థితి కొద్దిసేపే ఉంటుంది. దీన్ని నీడ లేని రోజుగా (జీరో షాడో డే) భావిస్తుంటారు. ఇది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో కనబడుతుంది. మనదేశంలో ఏప్రిల్‌ 6న ఇందిరా పాయింట్‌ వద్ద నుంచి ఇది మొదలైంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కొన్నిచోట్ల నీడ లేని రోజు కనిపించింది. చాలామంది దీన్ని గమనించి ఉండకపోవచ్చు. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. దీన్ని ప్రత్యక్షంగా అనుభవించటానికి ఇంకా అవకాశం ఉంది.

◼️మే 10, ఆగస్టు 2: సంగారెడ్డి, జనగాం, పాల్వంచ, విశాఖపట్నం

◼️మే 11, ఆగస్టు 1: మెదక్‌, వరంగల్‌, విజయనగరం

◼️మే 12, జులై 31: శ్రీకాకుళం

◼️మే 13, జులై 30: కరీంనగర్‌, పామునూరు, బొబ్బిలి

◼️మే 14, జులై 29: నిజామాబాద్‌, కోరుట్ల, రామగుండం, పాలకొండ

◼️మే 15, జులై 28: మంచిర్యాల, మందమర్రి

◼️మే 16, జులై 27: నిర్మల్‌, మండ

◼️మే 18, జులై 25: ఆదిలాబాద్‌

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...