Skip to main content

Today's news papers

దేవుడా అమ్మని బ్రతికించు...🙏

పెద్దబుడ్డిడి గ్రామం, జియమ్మలవలస మండలం, విజయనగరం జిల్లాకు చెందిన పడాల శ్రీనివాసరావు, స్వాతి కుటుంబ కన్నీటి గాథ ఇది...

వివాహమై ఆరేళ్ళు అవుతుంది, పిల్లలు లేరన్నా బాధతో మనస్తాపానికి గురైనా, ఆ తరవాత సంతానం కలిగింది...

పండంటి బాబుతో (తన్విర్) వారి జీవితం ఆనందమైంది, చిరుఉద్యోగమైన చింత లేకుండా గడిచిపోతుంది...

అలాంటి అందమైన జీవితంలోకి అనుకోని అతిధిలా గత నెల 31న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది...
రోడ్డు ప్రమాదంలో తండ్రి అక్కడే మరణించగా, తల్లి తలకి బలమైన గాయం వల్ల కోమాలోకి వెళ్ళింది...

అమ్మని ఎంతగా కదిలిస్తున్నా... కదలడం లేదు ఎందుకో...
నాన్న తనవైపే చూడటం లేదు ఎందుకో...
రోడ్డుపై ఎర్రటి ధారలేంటో అర్థంకాక, తన కంట్లో కన్నీరు చూస్తేనే ఉన్నపళంగా హక్కున చేర్చుకునే ఆ అమ్మ , తాను గుక్కపెట్టి ఏడుస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు ఎందుకో...
ఎవరెవరో వచ్చి హక్కున చేర్చుకుంటున్నారు... ఇది ఏమి అర్థం కానీ, ఆ పదినెలల చిన్నారి ఇప్పుడు అమ్మని బ్రతికించమని మిమ్మల్ని కోరుకుంటుంది...

Click here to get news papers 


ఈ నెల 6న స్వాతి గారికి కుడి కాలుకి, తలకి ఆపరేషన్ అయింది చేతికి కూడా బలమైన గాయం అయింది, కానీ తలకి బలమైన గాయం అవ్వటం వల్ల, ఆరెండు ఖచ్చితంగా పనిచేస్తాయి అని చెప్పలేము అని  డాక్టర్స్ చెప్పారు...
ప్రస్తుతం ఇంకా కోమాలోనే  ఉన్నారు అలాగే పరిస్థితి కూడా విషమంగానే ఉంది...

మన ఫౌండేషన్ సభ్యులు అయిన శ్రీమతి వేద గారు, లక్ష్మి గారు ఈ ఇష్యూని మన దృష్టికి తీసుకొచ్చారు... ఈ రోజు వేద గారు, స్వయంగా విశాఖపట్నం అపోలో హాస్పిటల్  కి వెళ్లిసమస్యను నిజ నిర్ధారణ చేయడం జరిగింది...

ఆపరేషన్ జరిగినా.. కళ్లు
కన్నీళ్లతోనే నిండాయి..

ఈ గాయం నుండి కోలుకోవాలన్నా...
ఆ కన్నీళ్ళు మాయం కావాలన్నా...
మన సాయం తప్పనిసరి.

ఉన్నదంతా పెట్టేసారు.
వీరి కుటుంబ అన్యోన్యత, ఆ తల్లి మంచితనం చూసి...
వీధిలో వాళ్లు కూడా తలో కాస్తా అందించారు...
 ₹7లక్షల్లో ₹5లక్షల వరకు కట్టగలిగారు... కానీ ఇంకా 2లక్షల వరకు అవసరం...
ఈ సమయంలో.. వారికి
రూ. 100 నుండి ఎంత ఇచ్చినా.. అవసరమే..

కనుక, యాభయ్యా? వందా? అని ఆలోచించకుండా...
తోచినంత చేద్దాం..

తన బాధ్యతగా.. దేవుడు ఆ అమ్మ ప్రాణం నిలబెట్టాడు...

మన బాధ్యతగా.. కాస్త సాయం చేసి ఆ కుటుంబాన్ని అప్పులపాలు కాకుండా నిలబెడదాం...

మీ సహాయాన్ని పంపించవల్సిన నంబర్స్
8328243019 (గూగుల్ పే),
9493791484 (ఫోన్ పే)

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...

నేటి మోటివేషన్... అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద...

సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధ...